CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రేగా అభివృద్ధి కి ఆకర్షితులై టీఆరెస్ తీర్థం పుచ్చుకున్న బీఎస్పీ పినపాక నియోజకవర్గ అధ్యక్షులు ,కార్యవర్గ సభ్యులు

Share it:

 


మన్యం మనుగడ, మణుగూరు: పినపాక ఎమ్మెల్యే, విప్ రేగా కాంతారావు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పినపాక నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ ) యువజన విభాగం అధ్యక్షులు ,కార్యవర్గ సభ్యులు టీఆరెస్ లో జాయిన్ అయ్యారు.

ఆ పార్టీ పినపాక నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పిల్లి అఖిల్ కుమార్ ,కార్యవర్గ సభ్యులు కొయ్యడా రాము,ఊళ్ళోది బాబురావ (బాబీ),జంగం శ్రీనివాస్ రావు, యదలపెళ్లి శ్రీను శనివారం టీఆరెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.రేగా కాంతారావుమణుగూరు క్యాంప్ కార్యాలయంలో వారికి టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి సాదరంగా టీఆరెస్ పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమ ధ్యేయంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది అన్నారు . భద్రాద్రి జిల్లా లో టిఆర్ఎస్ పార్టీని తిరుగులేని పార్టీగా తయారు చేయడం జరుగుతుందన్నారు .ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పొశం నరసింహారావు , సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు , మణుగూరు టౌన్ ప్రెసిడెంట్ అడపా అప్పారావు , ఉపాధ్యక్షుడు జానీ బాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి నవీన్ , అధికార ప్రతినిధి ఎడ్ల శ్రీను, పినపాక నియోజకవర్గ యువజన అధ్యక్షుడు మట్టపల్లి సాగర్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొసెట్టి రవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బానోత్ రమేష్, మణుగూరు టౌన్ అధ్యక్షుడు రుద్ర వెంకట్, ప్రధాన కార్యదర్శి గుర్రం సృజన్, ఎస్సీ సెల్ కార్యదర్శి కట్ట రాజ్ కుమార్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకట్ రెడ్డి, వెంకట్రావు, ఓబులాపురం రాజు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: