CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా సీఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు.మణుగూరు టిబిజికెయస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం.

Share it:

 


  • ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు     


మన్యం టీవీ మణుగూరు:


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల.చంద్రశేఖ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని, మణుగూరు టీబిజికేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి. ప్రభాకర రావు నేతృత్వంలో లో బుధవారం మణుగూరు సింగరేణి హాస్పిటల్ నందు, మెగా రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్య అతిధిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఏరియా లోని కొండాపురం భూగర్భ గని, ఓసి-2,ఓసి-04 లోని యువ కార్మికులతో పాటు అన్ని గనుల,డిపార్ట్ మెంట్ ల నుంచి విధులు నిర్వహిస్తున్న కార్మికులు,దాతలు గా ముందుకు వచ్చి రక్త దాన శిబిరం నందు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే రేగా మాట్లాడుతూ,బంగారు తెలంగాణ నిర్మాత, సింగరేణి కార్మికుల ఆశ జ్యోతి,60ఏళ్ళ తెలంగాణ కళను సాకారం చేసి,తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి లో దేశానికె దిక్సూచి గా మలచిన మనసున్న మహానేత ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకోవడం,సంతోషకరమైన విషయమన్నారు.అందులో భాగంగా నేడు మణుగూరు టిబిజికేయస్ వారు రక్త దాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.సీఎం కెసిఆర్ పై ప్రేమతో రక్తదానం కార్యక్రమం లో పాలు పంచుకొన్న దాతలకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం. విజయకుమారి,జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు,ఎంపీటీసీలు,సర్పంచ్ లు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ,అధ్యక్షులు అడపా.అప్పారావు, కార్యదర్శులు రామిరెడ్డి,నవీన్, పార్టీ కార్యకర్తలు,పార్టీ ముఖ్య నాయకులు,యువజన,నాయకులు,అభిమానులు,తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: