(మన్యం మనుగడ వాజేడు ఫిబ్రవరి 20)
చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దు వాజేడు మండలం చీకుపల్లి గ్రామo ఏజెన్సీ ప్రాంతం కావడంతో జాతీయ రహదారిపై ఎస్ఐ, హరీష్. సిబ్బందితో విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి వాహనాలలో ప్రయాణించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని, డ్రైవింగ్ లైసెన్సు, వాహనం యొక్క రికార్డులను ఖచ్చితంగా తమ వెంట తెచ్చుకోవాలని వాహనదారులకు సూచించారు. అనంతరం పలు వాహనాలను ఆయన తనిఖీలు నిర్వహించారు. అపరిచిత వ్యక్తులను చిరునామాలు అడిగి తెలుసుకున్నారు.
Post A Comment: