చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడు మృతి చెందిన సంఘటన శనివారం చండ్రుగొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. చండ్రుగొండ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సోమనపల్లి ఫకీర్ కుమార్(53) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మండల కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీ సమీపంలో లైన్ క్రాసింగ్ ప్రాంతంలో పాల్వంచ నుండి శుభకార్యానికి వెళ్లి వస్తున్న క్రమంలో స్కూటీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న సిగ్నల్ పైపును బలంగా ఢీ కొట్టాడు. దీంతో స్పందించిన స్థానికులు ప్రైవేటు వాహనం ద్వారా కొత్తగూడెంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమం లో చికిత్స పొందుతూ ఫకీర్ కుమార్ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు,ఒక కూతురు ఉన్నారు.
Post A Comment: