CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దళితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చెయ్యాలి బిఎస్పి డిమాండ్..

Share it:

 



మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 8, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం నందు మంగళవారం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేద దళిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని తహశీల్దార్ లూధర్ విల్సన్ కు మండలంలోని దళిత మహిళలు దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్భంగా బిఎస్పి పార్టీ మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటినుండి నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అనేక రకాల హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించి రాజకీయంగా లబ్ది పొంది అనంతరం దళితులను మోసం చేస్తోందని అన్నారు. మండల వ్యాప్తంగా ఉండడానికి గూడు, నీడ లేని దళిత కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయని అన్నారు. కావున ప్రభుత్వం అధికారులచే సర్వే నిర్వహించి ఇల్లు లేని ప్రతి దళిత కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు దేవరకొండ నిర్మల, మండల కార్యదర్శి గార్లపాటి సైదులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: