మన్యం మనుగడ మంగపేట.
ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు ఆదేశాల మేరకు ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమాన పరిచేలా రాజ్యాంగాన్ని మార్చాలని అనడాన్ని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు.ఈ సందర్బంగా కొమరం ధనలక్ష్మి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ నిర్మాత ను అవమాన పరిచిన వ్యక్తులపై దేశాద్రోహం కేసుపెట్టి అరెస్ట్ చేయాలి ప్రపంచం యావత్తు గర్వించదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది డా :అంబేద్కర్. అటువంటి మహానుభావులు రాసిన భారత రాజ్యాంగం మార్చడం అనే అనే ఆలోచన అనే పిచ్చి ప్రేలాపనలు కట్టి పెట్టి నాయకులు రాష్ట్ర, దేశ భవిష్యత్ పై ద్రుష్టి పెట్టి దేశ అభివృద్ధి కై పాటు పడాలని ఈసందర్బంగా సూచించారు.కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంగేర్ల రాజారత్నం పల్లికొండ యాదగిరి మాట్లాడుతూ భారత దేశ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ లాంటి మహోన్నత నాయకులు సైతం భారత దేశం కంటే భారత రాజ్యాంగం గొప్పది చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది అని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో కొంకతి సాంబశివరావు, ఇందారపు లక్ష్మణ్, కర్రీ నాగేంద్రబాబు, ఇస్సార్, నవీన్, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.
Post A Comment: