మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పినపాక నియోజకవర్గ ఫారెస్ట్ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,పోడు భూముల రైతుల జోలికి వెళ్లొద్దు అని అధికారులకు ఆదేశించడం జరిగింది.పోడు భూముల రైతులకు ఏదైనా జరిగితే ఫారెస్ట్ అధికారుల దే బాధ్యత అని తెలిపారు.భారి యంత్రాలను పోడు భూములలో కి తీసుకో వెళ్ళవద్దని,కందకాలు తవ్వొద్దు అని అధికారులకు సూచించారు.పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రతి ఒక్కరికి పోడు భూముల పట్టాలను ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం లోని ఏడూ మండలాల ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: