మన్యం టీవీ న్యూస్ ; జూలూరుపాడు, ఫిబ్రవరి 9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ఆదేశానుసారం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలతో నిరసన తెలిపి, ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకట రెడ్డి, ఎంపీపీ లావుడ్యా సోనీ, మండల రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ యదళ్ల పల్లి వీరభద్రం, రైతుబంధు జిల్లా సభ్యులు వేల్పుల నరసింహారావు, నల్లబండ బోడు సర్పంచ్ ముక్తి నరసింహారావు, బొజ్య తండా సర్పంచ్ లావుడ్యా కిషన్ లాల్, టిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు అల్లడి లింగారావు, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్ కె సుభాని, ఎస్సీ సెల్ పణితి వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షులు పోతురాజు నాగరాజు, ఎస్ కె మైబు, యువజన నాయకులు గుగులోత్ చంటి, సీనియర్ నాయకులు రామ్ శెట్టి రాంబాబు, రామిశెట్టి నాగేశ్వరావు, గాదె కృష్ణయ్య, మోదుగు రామకృష్ణ, లేళ్ల గోపాల్ రెడ్డి, భూక్యా లచ్చిరాం, చౌడం వెంగళ్ రావు, మాడుగుల నాగరాజు, పాలెపు భద్రయ్య, బానోత్ సక్రు నాయక్, వెంకటేశ్వర్లు, మిరియాల కిరణ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుగులోత్ రాంబాబు, బోడ బాబూలాల్, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: