మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 23 ) బుధవారం ;- భద్రాద్రికొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, ఆర్లపెంట గ్రామ పంచాయతీ పరిధిలోని అవాస గ్రామాలు అయిన కోడిసగట్టు,ఆర్లపెంట గ్రామ పంచాయతీలోని సీతారామ ప్రోజెక్టు పంట కాలువలో భూములను రైతులు కోల్పోయి. ప్రజల పంట భూములను అదికారులు తిసుకుని ఏరియాల్ సర్వ్ నిర్వహించారు భూముల గురించి దానికి నష్టం పరిహారం ప్రకటించివున్నారు.కానీ ఆ మొతం ప్రజలకు ఇవ్వలేదు. ప్రస్తుత సీతారాం ప్రోజెక్టు పంట కాలువ ఏర్పాటు చేయుటకు అధికారులు సర్వే నిర్వహించి భూమిని కోల్పోతున్న వారికి నష్ట పరిహారం ఇచ్చుట కొరకు లబ్దిదారులను గుర్తించారు. కానీ దాని కోసం ఇవ్వవలసిన నష్టపరిహారం మేము ఎప్పుడో చెల్లించివేశము అని భూములను వదిలి వేయాలి అని కాలువ అధికారులు అంటున్నారు.గ్రామ ప్రజలు తమ భూములను సర్వ్ నిర్వహించి లబ్దిదారులను గుర్తించి వారికి తగిన నష్ట పరిహారం ఇప్పించగలరని అధికారులను వేడుకున్న ఎలాంటి స్పందన లేనందువలన తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా కోర్టువారు కూడా మాకు అనుకూలంగా నష్ట పరిహారం ఇప్పించాలని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది.మా యొక్క భూములకు నష్ట పరిహారం చెల్లించే వరకు మా భూముల్లో కాలువ పనులు జరగకుండా ఆపాలి అని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కావున రైతులు కూడా సంతోషం వ్యక్తం చేశారు మా కోసం కృషి చేసిన యువ నాయకులు బాడిశ బిక్షం కట్టం ప్రసాద్ మరియు అరేం ప్రశాంత్ కాక శివశంకార్ ప్రసాద్లకు ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలియ పరచడం జరిగింది*
Post A Comment: