మన్యం మనుగడ వెబ్ డెస్క్:
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండ గ్రామం లో తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి తండ్రి గుగులోతు లింగ్యా నాయక్ ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో లింగ్యా నాయక్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు , జిల్లా జడ్పీ చైర్పర్సన్ కోరం కనకయ్య .
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వూకంటి గోపాల్ రావు గారు, బూర్గంపాడు మండల జడ్పిటిసి శ్రీమతి కామిరెడ్డి శ్రీలత_కొండా రెడ్డి దంపతులు,TRSV రాష్ట్ర కార్యదర్శి N.N.రాజు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు బొలిశెట్టి రజిని కుమార్ వర్మ , పాలం దివాకర్ రెడ్డి, తురక రామకోటి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: