భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ కారం విజయకుమారి అధ్యక్షతన సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ,ఫిబ్రవరి 24.02.2022 లోపు గిరివికాసం పథకం ద్వారా ఇద్దరు లేక ముగ్గురికి కలిపి 10 ఏకరముల లోపు భూమి గల ఎస్టీ రైతులకు ఐటిడిఎ నుంచి బోర్లు వేయుటం మరియు కరెంట్ సదుపాయం కల్పించడం జరుగుతుంది అని తెలిపారు. ఆసక్తి గల ఎస్టీ రైతులు వారి వారి గ్రామ పంచాయతిలలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.ధరఖాస్తుతో పాటు పాస్ ఫోటోలు-2,పట్టా పాసు పుస్తకం,ఆదాయం,కులదృవీకరణ పత్రం,ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ ను జతచేయలని ఎంపీపీ కారం.విజయ కుమారి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె.వీరబాబు,ఎంపీఓ పి.వెంకటేశ్వర రావు,మరియు కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: