మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 16, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకల సందర్భంగా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ పిలుపులో భాగంగా బుధవారం జూలూరుపాడు మండలం లోని శివారు కొమ్ముగూడెం గ్రామం నుండి ఏన్కూరు మండల కేంద్రం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోనీ వివిధ ప్రాంతాల నుంచి భారీగా కొమ్ముగూడెం తరలి వచ్చిన తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల తో కలిసి వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పెద్దమ్మ తల్లి ఆలయం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేరుమీద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్ పి టి సి భూక్య కళావతి, టిఆర్ఎస్ జిల్లా నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, కొమ్మినేని పాండురంగారావు, పోలుదాసు కృష్ణమూర్తి, మూడు చిట్టిబాబు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Post A Comment: