మన్యం టివి దుమ్ముగూడెం::
ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఈరోజు స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల లబ్ధిదారులకు జెడ్పిటిసి తెల్లం సీతమ్మ ,ఎంపిపి రేసులో లక్ష్మి, పలువురు సర్పంచులు చేతుల మీదుగా పంపిణీ చేశారు . అనంతరం నూతన మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు తదనంతరం గవర్నమెంట్ మెడికల్ సీట్లు సాధించిన లక్ష్మీ నగరం గ్రామానికి చెందిన రొష్మిత , చెర్రీ అభినందించి శాలువతో సత్కరించారు. లక్ష్మీ నగరం గ్రామంలో దాసఆంజనేయ స్వామివారి ఆలయంలో బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ రవి కుమార్, మండల అధ్యక్షులు శ్రీనివాసరావు ,సీనియర్ నాయకులుసీతారామారావు,అప్పల రెడ్డి, వెంకటరెడ్డి ,యువజన నాయకులు సందీప్ రెడ్డి, కనుబుద్ది దేవా ,వేణు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: