మన్యం మనుగడ, పినపాక :
మండల పరిధిలోని ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన రాయిగూడెం యూత్కు బుధవారం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి క్రికెట్ కిట్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,యువకులు స్నేహపూర్వక వాతావరణంలో ఆటలు ఆడాలన్నారు. అన్ని రంగాల్లో యువత ముందుండాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏడూళ్లబయ్యారం సర్పంచ్ కోరం రజిని, టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బూర రమేష్, యూత్ నాయకులు చిట్టిమళ్ల శ్రీనివాస్, సాంబశివరావు, రాములు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: