మన్యంటీవి, అశ్వారావుపేట:అశ్వారావుపేట మండల పరిధిలోని 36 మంది లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చేతుల మీదుగా సోమవారం అశ్వారావుపేట పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల పరిధిలోని కావడిగుండ్ల, కన్నాయిగూడెం, ఊట్లపల్లి, నారాయణపురం, తిరుమల కుంట, కోయి రంగాపురం, అల్లిగూడెం, బచ్చువారి గూడెం తదితర గ్రామాల కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఒక లక్ష 116 రూపాయల చెక్కులను గ్రామ పంచాయతీల సర్పంచులు ఎంపీటీసీల సమక్షంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో కళ్యాణలక్ష్మి పథకం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని, ఎందరో పేదలు ఆర్థిక స్తోమత లేని వారు పిల్లల పెళ్లిళ్లు కెసిఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఘనంగా నిర్వహిస్తున్నారని ప్రజలందరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, జడ్పీటీసీ చిన్న శెట్టి వరలక్ష్మి, రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ జూపల్లి రమేష్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సత్య వరపు సంపూర్ణ, పంచాయితీ సర్పంచులు గొంది లక్ష్మణరావు, సాదు జోష్నా బాయ్, మొడియం కృష్ణవేణి, స్థానిక తహసిల్దార్ చల్లా ప్రసాద్, వివిధ గ్రామాల ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: