CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రధాని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి - తెరాస మండలాధ్యక్షులు సతీష్ రెడ్డి

Share it:

 


మన్యం మనుగడ,పినపాక:

రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు మీద మరోసారి విషం చిమ్ముతూ పార్లమెంట్‌లో ప్రధాని మోడీ అడ్డగోలుగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. తెలంగాణ ప్రజానీకాన్ని అవమానపరిచిన ప్రధాని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు 

 నల్లబ్యాడ్జీలు ధరించి బిజెపి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణలో త్వరలో బిజెపికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: