CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముగిసిన మేడారం మహాజాతర. వనప్రవేశం చేసిన గిరి‘జన’దేవతలు.

Share it:

 


 

 మన్యం మనుగడ వెబ్ డెస్క్ ,హైదరాబాద్‌ : తెలంగాణ కుంభమేళా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతర ముగిసింది. భక్తుల నుంచి పూజలందుకు గిరిజన దేవతలు వనప్రవేశం చేశారు. వనప్రవేశం ఘట్టంతో మేడారం మహాజాతర ముగిసింది. సంప్రదాయం ప్రకారం పూజలు చేసిన అనంతరం అమ్మవార్లకు పూజారులు వీడ్కోలు పలికారు. సమ్మక్క చిలుకల గుట్టకు, సారామ్మల కన్నెపల్లికి, గోవిందరాజు కొండాయికి, పగిడిద్దరాజు పూనగొండ్ల బయలుదేరారు. చివరి రోజు అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవార్ల ప్రవేశం సందర్భంగా కొద్దిసేపు గద్దెల వద్ద దర్శనాలను కొద్దిసేపు నిలిపివేశారు. ఆ తర్వాత గద్దెల వద్ద దర్శనాలను పునరుద్ధరించారు. నాలుగు రోజుల పాటు సమ్మక్క, సారలమ్మ జాతర వైభవోపేతంగా సాగింది. ఈ సారి 1.30కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా.

Share it:

TS

Post A Comment: