గుండాల ఫిబ్రవరి 22 (మన్యం మనుగడ) మన ఊరు మనబడి కార్యక్రమం తో గుండాల, ఆళ్ల పల్లి మండలం లోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి అని ఎం ఈ ఓ పి.కృష్ణయ్య పేర్కొన్నారు. మండలం పరిధిలోని కాచన పల్లి గ్రామంలో గల పాఠశాలలో ఈ కార్యక్రమంపై కుమ్మడి గుండాల మండలం పాఠశాలల ప్రధానోపాధ్యాయుల తో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుండాల మండలం లో పది పాఠశాలలు ఆళ్లపల్లి మండలంలో ఎనిమిది పాఠశాలలు ఎంపికయ్యారు అన్నారు వీటిని ఆధునీకరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుందన్నారు. పాఠశాల ఎస్ఎంసి కమిటీ చైర్మన్ గ్రామ సర్పంచ్ ప్రధానోపాధ్యాయులు తో కమిటీ ఉంటుందన్నారు. వీరి ఆధ్వర్యంలో ఏఈ తోఎస్టిమేట్ తయారుచేసి నివేదిక సమర్పిస్తామని నారు. కమిటీ సూచించిన ప్రకారం పాఠశాల ఆధునీకరణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కిషన్, శారద, కాచన పల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాపయ్య , వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సీఆర్పీలు పాల్గొన్నారు.
Post A Comment: