CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తల్లిదండ్రుల మృతితో అనాధలైన చిన్నారులు..

Share it:



చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: ఏడాది వ్యవధిలోనే తల్లిదండ్రుల మృతితో చిన్నారులిద్దరూ అనాధలైన సంఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..... తిప్పనపల్లి గ్రామానికి చెందిన అంచ అప్పారావు(42)గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ రెండు రోజుల క్రితం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించారు. భార్య కోటేశ్వరి(39) ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో వీరి సంతానం ఉషారాణి,(10)సాయి వైష్ణవి(7) అనాధలుగా మిగిలారు. తల్లి ఏడాది క్రితం మృతి చెందిన విషయం మరవకముందే తండ్రి సైతం కిడ్నీ వ్యాధితో చనిపోవడంతో ఆ చిన్నారుల రోదనాలకు గ్రామం మొత్తం రోధించారు. ఇటువంటి కష్టం పగవాడికి కూడా రాకూడదని మహిళల రోధనలు మిన్నంటాయి. ఆ పేద కుటుంబంలో పుట్టిన చిన్నారులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు

Share it:

TS

Post A Comment: