మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి శనివారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను సందర్శించి, పలువురు విద్యార్థులలో తెలుగు పఠణ సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రత్యేక తరగతుల నిర్వహణ పై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బి వినాయక్ పఠణ సామర్థ్యాన్ని మెచ్చుకొని ప్రోత్సాహకరంగా 500 రూపాయలు నగదు బహుమానాన్ని ఇచ్చి దానితో మంచి పుస్తకాన్ని కొనుక్కోమని చెప్పడం జరిగింది. పాఠశాలలో కాళీగా ఉన్న హిందీ పండిట్ పోస్టును త్వరలో పిలప్ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ శ్రీనివాసరావు, బి రమణమ్మ, ఎస్ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: