CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముగిసిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు.ప్రధమ బహుమతి గెలుపొందిన సిటీ మెడికల్ జట్టు...

Share it:

 


మన్యం మనుగడ న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఏ ఐ వై ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జూలూరుపాడు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు ఆదివారం ముగిశాయి. జిల్లా నలుమూలల నుంచి సుమారు 50 జట్లు తలపడ్డాయి. ఆదివారం ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా కొనసాగింది. ఈ మ్యాచ్ లో సిటీ మెడికల్ జట్టు ప్రధమ బహుమతిని గెలుపొందారు. రెండవ బహుమతిని చండ్ర రామయ్య మెమోరియల్ జట్టు అందుకున్నారు. మూడో బహుమతిని దండు మిట్ట తండా జట్టు కైవసం చేసుకుంది. నాలుగో బహుమతిని షేక్ నాగుల్ మీరా జట్టు అందుకున్నారు. విజేతలకు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత క్రీడలతో పాటు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులను కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాష మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజంఅని, క్రీడాస్పురితో గెలుపు ఓటములాను ఆస్వాదించాలని అన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన ఏ ఐ వై ఎఫ్ జిల్లా సమితిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, చండ్ర నరేందర్ కుమార్, చింత సొరజరావు, ఎల్లంకి మధు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు గజ్జల సందీప్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోయిన విజయ్, ఎస్ కె నాగుల్ మీరా, నరేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోత్ మంగీలాల్, పున్నం శ్రీను, సతీష్, నరేష్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: