మన్యం మనుగడ, పినపాక:
సర్పంచ్ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పరామర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టీ.కొత్తగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ కణితి చిన్నక్క 3 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులకు రేగా కాంతారావు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఆత్మ చైర్మన్ భద్రయ్య, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాట్ల వాసు బాబు, ఇతర టీఆర్ఎస్ నాయకులు పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: