మన్యం టివి దుమ్ముగూడెం:
దుమ్మగూడెం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఏ జి హెచ్ ఎస్ కే రేగుబల్లి పాఠశాలలు మండల స్థాయిలో 4 మరియు 5వ తరగతి క్రీడా పాఠశాల చేరుటకు ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి 4వ తరగతి నుండి 20 మంది ఐదో తరగతి నుండి 20 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. పరుగుపందెం ,మరియు షాట్ ఫుట్,లాంగ్ జంప్ పోటీలు నిర్వహించి ఎంపిక చేయడం జరిగింది వివిధ పాఠశాలల నుండి విద్యార్థిని విద్యార్థులు 150 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఈఓ సున్నం సమ్మయ్య పాల్గొని ప్రారంభించారు .పి ఈ టి, పి డి సునీత ,పూర్ణచంద్రరావు, జానకమ్మ,పార్వతి పర్యవేక్షణలో పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు తేజ ప్రభాకర్ పాల్గొన్నారు
Post A Comment: