CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అగ్ని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలి అని డిమాండ్ చేసిన బిఎస్పి నాయకులు..

Share it:

 





మన్యం టివి దుమ్ముగూడెం::

నిన్న దుమ్ముగూడెం మండలం కోయ నర్సాపురం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పాయం సుబ్బయ్య కుటుంబం నివసించే ఇల్లు పూర్తిగా అగ్నిప్రమాదంలో కాలిపోయింది అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు లేఖ పోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు ఈ ప్రమాదంలో 5 లక్షల నగదు ,3 లక్షల విలువైన బంగారం, రెండు లక్షల సంబంధించిన వస్తువులు కాలిపోవడం జరిగింది .విషయం తెలుసుకున్న బహుజన సమాజ్ పార్టీ భద్రాద్రి జిల్లా ఇన్చార్జి పార్టీ ముఖ్య నేతలతో కలిసి సంఘటన స్థలాన్ని సందర్శించి కుటుంబాన్ని పరామర్శించి 3000 రూపాయల విలువైన నిత్యావసర సరుకులు, బట్టలు, 2000 రూపాయల నగదు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణార్జున రావు మాట్లాడుతూ సర్వం కోల్పోయిన సుబ్బయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో బిఎస్పీ భద్రాద్రి జిల్లా ఇన్చార్జి ఇర్ప కామరాజు, భద్రాచలం అసెంబ్లీ అధ్యక్షులు నాగరాజు ,చర్ల మండల అధ్యక్షులు వీర్రాజు ,సుజాత, నరసాపురం పంచాయతీ ప్రెసిడెంట్ ముదిరాజ్ ,రామకృష్ణ ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: