CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏకతాటిపైనే భద్రాద్రి టిఆర్ఎస్-:నూతన జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు.

Share it:

 




మన్యం మనుగడ,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ లో ఎలాంటి విభేదాలు లేవని, అందరూ ఏకతాటిపైనే ఉన్నారని, 

తాజా, మాజీ ఎమ్మెల్యేలతో త్వరలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు టిఆర్ఎస్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. అందరిని కలుపుకుపోయే సహనం, ఓపిక తనక ఉంది, కేసీఆర్ నాయకత్వంలోనే జిల్లా మొత్తంలో టిఆర్ఎస్ జండా రెపరెపలాడుతుంది అని రేగా తెలిపారు. పోడు భూముల సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుంది, అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, జిల్లాలో పార్టీని బలోపేతం తదితర అంశాలమీద మీడియా సమావేశంలో రేగా కాంతారావు మాట్లాడారు. ఈ సమావేశంలో కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా డైరెక్టర్ మోరే భాస్కర్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గోపాల్ రావు, పార్టీ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: