CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏలైవ్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ.

Share it:

 



మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం ఏలైవ్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అశ్వారావుపేట లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మరియు బాలికల ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ రాంబాబు మాట్లాడుతూ పాఠశాలలో చదివే పదోతరగతి విద్యార్థులకు మే నెలలో జరగబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏలైవ్ యూత్ ఫౌండేషన్ వారు స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ చేయడం చాలా సంతోషకరం అని అన్నారు. ఏలైవ్ యూత్ పౌండేషన్ వాళ్లు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు సలీం మాట్లాడుతూ ఎలైవ్ యూత్ ఫౌండేషన్ వాళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులే ఇలా ఒక ఫౌండేషన్ స్థాపించి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు వచ్చి ఈ కార్యక్రమమే కాదు, కరోనా టైం లో వీళ్ళు చేసిన సేవలు మరిచిపోలేనిది మనకి కరోనా వస్తే మన ఇంట్లో వాళ్లే ఇంటి పక్కన వాళ్ళు కూడా సహాయం చేయలేని పరిస్థితిలో వీళ్లు మన ఇంటి తలుపు తట్టి మేమున్నాం మీకు అధైర్య పడకండి అని ధైర్యం చెప్పారని, అలాగే ఎంతో మందికి రక్తదానం చేయిస్తున్నారని కొండ ప్రాంతాల్లో వీళ్ళు తిరగని ప్రదేశాలు లేవని, వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలి మా సపోర్ట్ కూడా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలైవ్ యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు చొక్కా అశోక్, సెక్రటరీ చిప్పనపల్లి శ్రీను, సభ్యులు నిఖిల్, మహేష్, శాలెం చక్రవర్తి, కృపాకర్, దయ, కృష్ణ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: