మన్యం మనుగడ మంగపేట.
ప్రభంజనపదం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వత్సవాయి శ్రీధర్ వర్మ మాట్లాడుతూ పత్రికలు ప్రజలకు ప్రజా సమస్యలకు వారధిగా ఉండాలని ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకుపోయే క్రమంలో పత్రికలే కీలకంగా వ్యవహారించాలని నిరంతర ప్రజా సంక్షేమం కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం జర్నలిజం రాతలు వార్తలు ఉపయోగపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు ములుగు జిల్లా అధ్యక్షులు అశోక్ కుమార్ బోర్ నర్సాపురం ఎంపీటీసీ మూగ ల రమేష్ తెలంగాణ మాల మహానాడు జిల్లా అధికార ప్రతినిధి బోడ శ్రీను మేడిద సతీష్ సాంబశివరావు బేత వెంకటేష్, సాంబశివరావు బిలపాటి నరేష్ గండి ధర్మ రాజు కొంబత్తిని బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: