చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: ప్రధానమంత్రి తెలంగాణ వ్యతిరేకమని టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారా బాబు, ప్రధాన కార్యదర్శి ఉత్పతల ఏడుకొండలు ఆరోపించారు. బుధవారం టిఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో ప్రధాన సెంటర్లో భారీ ప్రదర్శన నిర్వహించి, ప్రధానమంత్రి నరేంద్రమోడి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాజ్యసభలో ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాటు సక్రమంగా జరగలేదని తన అక్కసును వెళ్లగక్కటం సరికాదని, తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల త్యాగాలను అవహేళన చేయటం జరిగిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు నల్లమోతు వెంకటనారాయణ,రసూల్, మేడ మోహన్ రావు, ఉన్నం నాగరాజు, భూపతి శ్రీనివాసరావు,వంకాయలపాటి బాబురావు, సూర వెంకటేశ్వరరావు, చాపలమడుగు రామరాజు, రత్నాకర్, గూగుల్ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: