మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మణుగూరు టిఆర్ఎస్ మహిళ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా నుతన అధ్యక్షులు రేగా కాంతారావు ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గా నియమితులు అవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ విప్ రేగా కాంతారావు ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఫోటో ఫ్రేమ్ ను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గా విప్ రేగా ను నియమించినందుకు సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం.విజయకుమారి, మహిళ విభాగం అధ్యక్షురాలు, రమాదేవి,చంద్రకళ,మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: