CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గ్రామాలలో తెరాస పార్టీని బలోపేతం చేయండి.ప్రతి కార్యకర్త కు తెరాస పార్టీ అండ.అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు.

Share it:

  


చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: గ్రామస్థాయిలో తెరాస పార్టీ ని బలోపేతం చేయాలని అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం తన నివాసంలో చండ్రుగొండ మండల తెరాస కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు కలిసిన సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా చూడాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పై ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసిలు దారా బాబు, లంకా విజయలక్ష్మి, భూక్యా రాజి, సర్పంచ్ మల్లిపెద్ది లక్ష్మీ భవాని, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, తెరాస నాయకులు మేడా మోహన్ రావు, ఉన్నం నాగరాజు, సత్తి నాగేశ్వరరావు, వంకాయలపాటి బాబురావు, కళ్లెం వెంకటేశ్వర్లు, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: