CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతు వేదికను ప్రారంభించిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్.మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

Share it:

 



 

మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 8, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని పాపకొల్లు గ్రామపంచాయతీలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ మంగళవారం ప్రారంభించారు. అదేవిధంగా మండలంలోని సాయిరాం తండా, భీమ్లా తండా, హరిజనవాడ గ్రామాలలో నూతన సీసీ రోడ్ల కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు, రైతులకు అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు అండదండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోనీ, జడ్పీటీసీ కళావతి, సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డి, మండల రైతు సమితి అధ్యక్షులు వీరభద్రం, మండల పార్టీ అధ్యక్షులు నరసింహారావు, ఆయా గ్రామ పంచాయతీల తాజా, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: