గుండాల /ఆళ్లపల్లి ఫిబ్రవరి 7 (మన్యం మనుగడ) గంజాయి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలని ఇల్లందు డిఎస్పి రవీందర్ రెడ్డి కోరారు. సోమవారం రాళ్ల పల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ప్రజా ప్రతినిధులు యువత తో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంజాయి, మాదక ద్రవ్యాలు వాడడం వలన అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని అన్నారు. వాటి నిర్మూలన కోసం పోలీస్ వారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ.సంతోష్ , జెడ్ పి టి సి హనుమంతరావు, ఎంపీపీ మంజు భార్గవి, వాయిస్ ఎంపీపీ ఎల్లయ్య , టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు, ప్రధాన కార్యదర్శి బాబా, ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు
Post A Comment: