గుండాల ఫిబ్రవరి 7 (మన్యం మనుగడ) పోడు భూముల పరిరక్షణ కై తలపెట్టిన తోడు యాత్రను జయప్రదం చేయాలని టిడిపి నాయకులు గుండాల ఎంపీటీసీ సంధాని కోరారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. లింగాల, గుండాల, టేకులపల్లి, కొత్తగూడెం వరకు సాగే ఈ యాత్రలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తామంటే ఫారెస్ట్ అధికారులు వాటిని లాక్కొని ట్రెంచ్ కొట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. పోడు భూముల పరిరక్షణ కై చేసే యాత్రలు రైతులు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. ఈ ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు సాంబయ్య , నాయకులు ఇల్లందుల నరసింహులు, ఇల్లందుల అప్పారావు, మధు, మల్లయ్య , రాంబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: