మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 17, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మూడు రోజుల జన్మదిన వేడుకలను జూలూరుపాడు మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్వా రాములు నాయక్ ఆదేశానుసారం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు ఆధ్వర్యంలో గురువారం జూలూరుపాడు మండల కేంద్రం లోని సాయిబాబా ఆలయమునందు సీఎం కెసిఆర్ పేరు మీద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల స్కూల్ నందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ బర్త్డే కేక్ ను పిల్లలతో కలిసి కట్ చేసి, సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. తదుపరి స్కూల్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో తోటి ఉండాలని, తాను కలలు కన్న బంగారు తెలంగాణను సాధించే శక్తి మనమంతా ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, ఎంపీపీ లావుడ్యా సోనీ, రైతుబంధు మండల కో ఆర్డినేటర్ యదళ్లపల్లి వీరభద్రం, రైతుబంధు జిల్లా సభ్యులు వేల్పుల నరసింహారావు, వెంగన్న పాలెం ఎంపిటిసి దుద్దుకూరు మధుసూదన్ రావు, శంభుని గూడెం సర్పంచ్ దొడ్డ వెంకట రామారావు, సొసైటీ డైరెక్టర్ భూక్యా జోహార్ లాల్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు పాణితి వెంకటేశ్వర్లు, జిల్లా యువజన నాయకులు దొండపాటి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు రామి శెట్టి నాగేశ్వరరావు, పోతురాజు నాగరాజు, మోదుగు రామకృష్ణ, రామిశెట్టి రాంబాబు, బానోత్ సక్రునాయక్, లేళ్ల గోపాల్ రెడ్డి, ముదిగొండ రమేష్, బోడ నాగరాజు, చౌడం వెంగళ రావు, మాడుగుల నాగరాజు, మిరియాల కిరణ్, బోడా బాబూలాల్ పాపకొల్లు ఉపసర్పంచ్ కంబాలమహేష్, టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుగులోత్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: