CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నాణ్యత ప్రమాణాలు పాటించి మేడారం జాతర పనులు పూర్తి చేయాలి.భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా తల్లుల దర్శనం అయ్యేలా అధికారులు జాగ్రత్త లు తీసుకోవాలి-మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కోమరం ధనలక్ష్మి:.

Share it:



మన్యం మనుగడ మంగపేట.


మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మరో వారం రోజుల్లో మొదలు కాబోతున్న మేడారం జాతరకు ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం చేస్తున్న పనులు జాతర సమీపిస్తున్న ఇప్పటి వరకు పూర్తి కాలేదని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే విదంగా ఉ న్నాయని అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా జరుతున్న అధి కారులు పట్టించుకోవడం లేదని పనులలోను నాణ్యత ప్రమాణాలు పాటించకుండ నాసిరకం గా చేస్తున్నారని పనులలోను అవకతవకలు జరుగుతున్నట్లు తెలుస్తోందని కాంట్రాక్టర్లు తమ కిష్టమైన విధంగా పనులు చేస్తున్నారని మహిళా కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షురాలు కోమరం ధనలక్ష్మి అన్నారు.సోమ వారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మేడారం జాతరకు ఈ సారి తెలంగాణ ప్రభుత్వం 75 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని సకాలంలో పనులు పూర్తికాక ముందస్తుగా వస్తున్న భక్తులు సౌకర్యాలు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఇప్పటి వరకు పనులను పూర్తి చెయ్యనివారి పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Share it:

TS

Post A Comment: