మన్యం టీవీ, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అశ్వాపురం భారజల కర్మాగారం ఉద్యోగి ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్ ఇల్ల సురేంద్రబాబు,గురువారం, తెల్లవారుజామున గుండెపోటుతో హఠాత్ మరణం చెందినారు,అతని మరణవార్త తెలుసుకున్న టిఆర్ఎస్ మండలం నాయకులు అతని భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి వారి కుటుంబ సభ్యులకుప్రగాఢ సానుభూతి తెలిపినారు. ఈ కార్యక్రమంలో,టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కందుల కృష్ణార్జున రావు,భారజల కర్మాగారం ఉద్యోగులు యూనియన్ నాయకులు,పాండ్యా కేశవరావు, ఎల్ మోహన్ రావు,రాజేష్ ,రమేష్,పెద్ది రెడ్ల శ్రీను,ఎం వెంకటేశ్వర్లు ,పోతురాజు, శ్రీను, సర్వర్ పాషా,ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: