మన్యం టీవీ న్యూస్, దమ్మపేట ఫిబ్రవరి ( 08 ) మంగళవారం :సంక్షేమ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సాధ్యం అని అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. దమ్మపేట మండల రెవెన్యూ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో తల్లితండ్రులు ఆడపిల్లల పెళ్ళిల్లు చేయడానికి ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా మంచి ఆలోచన, అని ఈ పథకం ద్వారా అనేక మందికి లబ్ధి చేకూరిందని తెలిపారు. లబ్ధిదారులు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు కు కృతజ్ఞతలు తెలిపారు .
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ ధారా మల్లికార్జున్ రావు, సొసైటీ చెర్మన్ రావు జోగేశ్వర రావు, మండల యువజన అధ్యక్షులు గోపి శాస్త్రి, టౌన్ అధ్యక్షులు యార్లగడ్డ బాబు, వైస్ ప్రెసిడెంట్ ధారా యుగoదర్ , దొడ్డా రమేష్, పగడాల రాంబాబు, అబ్దుల్ జిన్నా, పానుగంటి చిట్టిబాబు, కొయ్యల అచ్యుత్ రావు, కౌలురి నాగయ్య ,పసుమర్తి సుదర్శన్, బండ్ల లక్ష్మయ్య, రావూరి వీరయ్య ,కోటి లోకేష్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: