తెలంగాణ లో ప్రభుత్వం పథకాలు సూపర్ అని సిక్కిం పశుసంవర్ధక శాఖ మంత్రి లోకనాథ్ శర్మ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను తన కార్యాలయంలో ఆయన ఇవ్వాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను తలసాని ఆయనకు వివరించారు.
తెలంగాణ పథకాలు అద్భుతం
తలసానితో మీటింగ్ తర్వాత సిక్కిం మంత్రి లోకనాథ శర్మ మాట్లాడారు. పాడి రైతులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలు అద్భుతమని ప్రశంసించారు. ఇక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు బాగున్నాయని కొనియాడారు. తమ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. రాష్ట్ర పర్యటనలో తాను అనేక విషయాలు తెలుసుకొన్నాను అని…ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో ఆర్ధికంగా ఎంతో అభివృద్దిని సాధించిందని పేర్కొన్నారు.
Post A Comment: