గుండాల /ఆళ్లపల్లి ఫిబ్రవరి 9 (మన్యం మనుగడ) పోడు భూముల పరిరక్షణ కై టిఆర్ఎస్ పార్టీ ఆళ్లపల్లి మండలం కమిటీ ఆధ్వర్యంలో ఎస్టీసెల్ మండల అధ్యక్షులు లక్ష్మయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం జి.లక్ష్మయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి మాట్లాడుతూ. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలనుసారం మండలంలో పోడు భూముల పరిరక్షణకై కమిటీ సమావేశం నిర్వహించి అన్ని గ్రామాల్లోని రైతు దారులతో మాట్లాడే విధంగా ఈ సమావేశంలో తీర్మానించారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇచ్చేందుకు రైతుల వద్ద నుండి దరఖాస్తులు తీసుకొని ఉన్నందున ఫారెస్ట్ అధికారులు పోడు భూములు జోలికి వెళ్లవద్దని సూచించారు. సాగులో ఉన్న పోడు భూములు జోలికి ఫారెస్ట్ అధికారులు వెళ్లవద్దని వారు డిమాండ్ చేశారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతుల కు పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. ఫారెస్ట్ అధికారులు అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారని అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రామయ్య ,ప్రధాన కార్యదర్శి బాబా, ఉపాధ్యక్షులు ఉకే భద్రం, అధికార ప్రతినిధి హతహార్, కిషోర్, ఆదాం, కయ్యమ్, కొమరం నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: