మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 21, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని సబ్ పోస్ట్ కార్యాలయం పరిధిలోని వినోబానగర్, సూరారం, బొజ్యాతండా, నల్లబండబోడు గ్రామాలకు నూతనంగా మంజూరి అయిన పోస్ట్ బ్రాంచ్ కార్యాలయాలను సోమవారం పోస్టల్ శాఖ జిల్లా సూపరెంటెండెంట్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ ( ఎస్పీ) బి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. తపాలా శాఖ యొక్క సేవలను గ్రామస్తులంతా వినియోగించుకోవాలని కోరారు. తపాలాశాఖలో గ్రామాలలోని ప్రజలందరూ పోస్టల్ ఖాతాలు తెరుచుకుని వివిధ రకాల ప్రభుత్వ లాభాలను పొందాలని అన్నారు. అనంతరం నల్లబండబోడు గ్రామపంచాయతీ సర్పంచ్ ముక్తి నరసింహారావు రవి కుమార్ ను ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ కోటేష్, ఓఎస్ శేఖర్, ఎస్పి ఎమ్ కళ్యాణ్, మణికుమార్ సత్యనారాయణ గిరీశంకర్ బొజ్యా తండా సర్పంచ్ లావుడ్యా కిషన్ లాల్, భూక్య పద్మ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: