CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎంబిబిఎస్ చదువుకు ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వ విప్ రేగా.

Share it:

 


 మన్యం మనుగడ కరకగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు ,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు, గుండాల మండలం చీమలపాడు గ్రామానికి చెందిన కల్తీ భవాని ఎంబిబిఎస్ చదువుకొనుటకు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 77000 రూపాయల నగదును ఆ విద్యార్థినికి రేగా కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా పైకి తీసుకు రావడమే రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ బాధ్యతని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన విద్యార్థులకు గిరిజన కుటుంబాలకు నిరుపేద కుటుంబాలకు ట్రస్టు అన్ని వేళలా అండగా ఉంటుందని ఆయన అన్నారు రు కల్తీ భవాని ఎంబీబీఎస్ పూర్తి చేసి ఏజెన్సీ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలని విద్యార్థిని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి సుధారాణి కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: