మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 8, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఈ నెల 20వ తేదీన జరుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నా భద్రాచలం పట్టణానికి చెందిన చారు గుండ్ల శ్రీనివాసరావు, ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జూలూరుపాడు లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మండల నాయకులు, జిల్లా, రాష్ట్ర, కౌన్సిల్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఆర్యవైశ్య మహాసభ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి మండలాల వారీగా పర్యటిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ భవన నిర్మాణానికి స్థలసేకరణ తో పాటు, భవన నిర్మాణానికి తన వంతు ఆరు లక్షల రూపాయల విరాళాన్ని అందజేస్తామన్నారు. జిల్లా మహా సభ ద్వారా నిరంతరం కొనసాగే విధంగా సేవా ట్రస్ట్ ను ఏర్పాటు చేసి, పేద ఆర్యవైశ్య విద్యార్థినీ, విద్యార్థులను పేద ఆర్యవైశ్యుల ను ఆదుకుంటామన్నారు. 20న జరిగే ఎన్నికల్లో తనను గెలిపించి జిల్లా ఆర్యవైశ్యులకు సేవచేసే. భాగ్యాన్ని కల్పించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు పెండ్యాల ప్రసాదరావు, తొండపు సుబ్బారావు, కొదుమురు భాను ప్రకాష్, పట్టణాధ్యక్షుడు ఉడతా పూర్ణచందర్రావు, రాష్ట్ర, జిల్లా కౌన్సిల్ మెంబర్లు కొదు మూరు మల్లికార్జునరావు, పెండ్యాల కృష్ణ మూర్తి, తొండపు సత్యనారాయణ, వందనపు కమలాకర్, కొదు మూరు రమేష్, పెండ్యాల రామనరసింహారావు, కొదు మూరు కోటేశ్వరరావు, పెండ్యాల శ్రీనివాసరావు, చిట్లూరు మహేష్ బాబు, ఉడతా వెంకటేశ్వర్లు, వేముల గురునాథం చారు గుండ్ల నాగభూషణం, రమేష్, వినోద్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: