మన్యం మనుగడ ప్రతినిధి అశ్వాపురం:ఈరోజు తెలంగాణ ఉద్యమ యోధుడు బంగారు తెలంగాణ నిర్మాత అపర భగీరధుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు,ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో తెరాస పార్టీ కార్యాలయంలో తెరాస పార్టీ మండల నాయకులతో కలిసి కేక్ కట్ చేసి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపటం జరిగింది. అనంతరం పార్టీ కార్యాలయం నుండి భారీ బైక్ ర్యాలీలతో ఆరిఫా, రోష్ని వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు, పండ్లు, పాలు, బ్రెడ్ ను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ ఎస్ సి విభాగం అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ వీరభద్రం, సినీయర్ నాయకులు కందుల కృష్ణార్జున, జాలే రామకృష్ణ రెడ్డి ,యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కోరేం రామారావు, ఎస్సీ, ఎస్టి భాగం అధ్యక్షులు, నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షులు లంకల రమేష్, యువజన నాయకులు సర్పంచ్ లు ఎంపీటీసీ లు, మండల తెరాస పార్టీ నాయకులు, యువజన నాయకులు, సోషల్ మీడియా సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: