CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆర్యవైశ్య సంఘం,వాసవి క్లబ్ మరియు వాసవి వనిత వారి ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం.ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.

Share it:


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, తోగ్గుడెం మినీ మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వచ్చే భక్తులకు మణుగూరు ఆర్యవైశ్య సంఘం,వాసవి క్లబ్ మరియు వాసవి వనిత వారి ఆధ్వర్యంలో ఉచిత అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.ఈ సందర్భంగా మాట్లాడుతూ,ఆర్యవైశ్య సంఘం,వాసవి క్లబ్ మరియు వాసవి వనిత క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు.జాతర 16,17,18 తేదీలలో మూడు రోజులు కూడా ఉచిత అన్నదానం కార్యక్రమం నిర్వహించబడుతుంది అని ఆయన తెలిపారు.ప్రతి సారి సమ్మక్క-సారక్క జాతరకు ఉచిత అన్నదానం లాంటి సేవ కార్యక్రమాలను ఆర్యవైశ్య సంఘం,వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని వారి సేవలను కొనియాడారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విప్ రేగా కోరారు.అనంతరం విప్ రేగా స్వయంగా భక్తులకు బోజనాలను వడ్డించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,ఎంపీపీ కారం.విజయకుమారి,ఎంపీటీసీ రమ్య,సర్పంచ్ బొగ్గం.రజిత, దోసపాటి.వెంకటేశ్వరరావు,ఆర్యవైశ్య సంఘం సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు మరియు వాసవి వనిత క్లబ్ సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు,కార్యదర్శులు రామిరెడ్డి,నవీన్,పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు,యువజన విభాగం నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: