మన్యం మనుగడ మేడారం.
మేడారం సమ్మక్క సారక్క మహా జాతర వన దేవతల కృపకటాక్షాలతో జాతర విజయవంతం అయ్యింది అని ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్
కుసుమ జగదీష్ తెలిపారు.
ప్రతి క్షణం కష్టించి పని చేసిన అధికార యంత్రాంగనికి హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు.
సమ్మక్క సారక్క తల్లులు జాతర ముందుగా మొదలుకొని గద్దెల మీద కొలువుదీరి
వనం చేరే వరకు సమాజానికి సమాచారం పంపిన ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
కోవిడ్ భయంకరమైన ఆందోళన మధ్యలో ప్రజలు భారీగా సమ్మక్క సారక్క వన దేవతలను దర్శించుకున్నారు.
ప్రజల సహకారంతోనే జాతర విజయవంతంగా సాగింది.
సుమారు కోటి మందికి పైగా భక్తులు భారీగా మొక్కుబడులు చెల్లించుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మేము అందరం పని చేశాం అన్నారు.
ఈసారి 75 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించారు.
25 కోట్ల రూపాయల శాశ్వత నిర్మాణాలు చేపట్టారు.
రాబోయే జాతరకు శాశ్వత నిర్మాణాలు చేపడుతామని అన్నారు.
సమ్మక్క సారక్క తల్లులకు గద్దెల మీద ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు.
Post A Comment: