గుండాల ఫిబ్రవరి 8 (మన్యం మనుగడ) పోడు భూముల జోలికి రావద్దని ఆళ్ల పల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, సొసైటీ చైర్మన్ రామయ్య ఫారెస్ట్ అధికారులను కోరారు. మంగళవారం మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు మాట్లాడుతూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫారెస్ట్ అధికారులతో సమావేశం నిర్వహించి పోడు భూముల జోలికి వెళ్లవద్దని ఆదేశించారు అన్నారు. మండలంలోని రైతులకు త్వరలోనే పట్టాలు వస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు అన్నారు. అందుచేత ఫారెస్ట్ అధికారులు పోడు భూములు జోలికి వెళ్లవద్దని వారు కోరారు. బుధవారం నుండి మండలంలోని అన్ని గ్రామాలలో రైతులకు పట్టాలపై వారికి వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా నాయకులు ఆదాం పాల్గొన్నారు
Post A Comment: