- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు , టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఇటీవల బూర్గంపాడు మండలం మొరంపల్లి బoజర గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త బిజ్జం కృష్ణారెడ్డి (40) సంవత్సరాలు కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు మృతి చెందడంతో టిఆర్ఎస్ పార్టీ తరఫున మంజూరైన రూ.2 లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీలో సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు చనిపోతే పార్టీ ఇన్సూరెన్స్ చేసి రూ.2 లక్షల ప్రమాద భీమా టిఆర్ఎస్ పార్టీ అందజేస్తుందని, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ను పార్టీ అధిష్టానం కంటికి రెప్పలా కాపాడుకుంటూఉందని తెలియజేశారు.
గ్రామస్థాయి నుంచి పార్టీని ప్రతిష్ట పరచడంలో కార్యకర్తల పాత్ర క్రియాశీలకమైనదoన్నారు. టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పేదల అభివృద్ధి కి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: