గుండాల /ఆళ్లపల్లి ఫిబ్రవరి 17 (మన్యం మనుగడ) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆళ్లపల్లి మండలానికి చెందిన టిఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకులు ఆదాం తన ఇంటి వద్ద మొక్క నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి కెసిఆర్, పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వారిరువురి పుట్టిన రోజులకు మొక్క నాటుతున్న అని ఆయన మన్యం మనుగడ కు తెలిపారు.మొక్కల పెంపకం తోనే భావి తరాలకు మనుగడ అన్నారు.సీఎం కేసీఆర్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ల స్ఫూర్తితో ఆకుపచ్చని తెలంగాణ కు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Post A Comment: