మన్యం వెబ్ డెస్క్(ములుగు):
ములుగు జిల్లా కేంద్రంలోని ఆదివాసీ నాయకపోడు గట్టమ్మ తల్లి కి దేవగిరిపట్నం గ్రామాలకు చెందిన *రుద్రోజు రమేష్ బాబు - సబితా* దంపతులు కుటుంబ సమేతంగా కలిసి గట్టమ్మ తల్లికి వెండి కిరీటాన్ని బహుకరించారు.ఈ సందర్భంగా అమ్మవారు కిరీట దాతలు రుద్రోజూసబితా -రమేష్ బాబు దంపతులు మాట్లాడుతూ గట్టమ్మ తల్లి ఎల్లవేళలా మాకు అండగా నిలుస్తూ భక్తుల కోరిక కోరికలు తీరుస్తూ భక్తుల హృదయాల్లో కొలువై ఉన్నారని అన్నారు.భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం గట్టమ్మ తల్లి అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకపోడు జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్ గట్టమ్మ తల్లి ప్రధాన పూజారులు కొత్త సదయ్య , కొత్త రవి ఆకుల మొగిలి , చిర్ర మహేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: