CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

2022 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ.

Share it:

 



 మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో కాసాని చంద్రమోహన్ అద్వర్యంలో అశ్వారావుపేట మండల నాయకులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీద అభిమానంతో నూతన సంవత్సర క్యాలెండర్లు ప్రింట్ వేయించారు. మంత్రి పువ్వాడ పిలుపు మేరకు ఈ రోజు వారి స్వగృహం నందు పువ్వాడ చేతుల మీదగా 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. క్యాలెండర్ చూసిన మంత్రి పువ్వాడ కాసాని చంద్రమోహన్ని అభినందించారు. ఈ సందర్బంగా పువ్వాడా మాట్లాడుతూ పువ్వాడ యువజన సంఘం ఆధ్వర్యంలో కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా కేవలం ఒక్క రూపాయికి దోశ కార్యక్రమం రాష్ట్రంలోనే వైరల్ అయిందని ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన అశ్వారావుపేట మండల నాయకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అశ్వరావుపేట మండల నాయకులు సొసైటీ చైర్మన్ నూతక్కి నాగేశ్వరావు, వైస్ ఎంపీపీ ఫణీంద్ర, కలపాల శ్రీనివాస్, కాసాని చంద్రమోహన్, యువజన నాయకులు మోటురి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: